సిబ్బంది లేక ఎక్కడిచెత్త అక్కడే
మొరాయిస్తున్న బోరు మోటర్
తాగునీరు లేక ఇబ్బందులు
మైలార్దేవ్పల్లి,డిసెంబర్3: మండలంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో కనీస వసతులు లేక వైద్యసిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ చేస్తూ వైద్యులు బిజీగా ఉంటున్నారు. దవాఖానలో నీరు లేకపోవడంతో రోగులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. బోరు మోటరు మొరాయిస్తున్నప్పుడల్లా వైద్య సిబ్బంది సొంత ఖర్చులతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆరోగ్య కేంద్రం ఏర్పడి ఆరేండ్ల గడుస్తున్నప్పటికీ తాగునీటి కనెక్షన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. క్లీనింగ్ చేసేవారు లేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుందని వైద్య సిబ్బంది వాపోతున్నారు. మూడు రోజులకొకసారి జీహెచ్ఎంసీ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు.
పలుమార్లు ఫిర్యాదు చేశాం
నీరు లేకపోవడంతో డ బ్బులు వెచ్చించి కొంటు న్నా ం. జలమండలి అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేసిన నీటి కనెక్షన్ ఇవ్వడం లేదు. బోరు మోటరు మరమ్మతులు సొంత ఖర్చులతో చేయిస్తున్నాం. ఇప్పటికైనా జలమండలి అధికారులు నీటి కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం.
-సిరాజుద్దీన్, కమ్యూనిటీ హెల్త్ అధికారి
లెటర్ ఇస్తేనే కనెక్షన్ ఇస్తాం
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ంలో తాగునీటి సమస్య ఉన్న ట్లు మా దృష్టి వచ్చింది. నీటి కనెక్షన్ ఇవ్వాలంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ ఇవ్వా ల్సి ఉంటుంది.
-అబ్దుల్ సత్తార్, జలమండలి డీజీఎం