మైలార్దేవ్పల్లి : యువకులు ఉద్యోగాలు వచ్చేవరకు ఆగకుండా ఏదైన స్వయం ఉపాధి చేసుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎల్లోక్యాబ్ బిర్యాని రెష్టారెంట్ను ప్రకాష్గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పిలిప్పియన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్న పద్మశాలిపురం బస్తీకి చెందిన రాజా, సాయి కిరణ్లు కరోనా కారణంగా స్వదేశానికి వచ్చి ఆన్లైన్ క్లాసులు వింటూ రెస్టారెంట్ ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే అబినం దించారు. వారు తమ చదువు పూర్తయ్యే వరకు ఖాళీగా ఉండకుండా వ్యాపారం చేయడం గొప్పవిషయం అన్నారు.
నేటి యువత ఉద్యోగాలు వచ్చే వరకు తల్లిదండ్రులకు భారం కాకుండా తమ కాళ్లపై నిలబడడానికి కృషి చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అలాంటి యువతను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అలాగే శుభ్రతను పాటిస్తూ నాణ్యమైన రుచికరమైన బిర్యానీని ప్రజలకు అందించాలని నిర్వాహకులను కోరారు.
ఈ కార్యక్రమంలో మైలార్దేదేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు టి ప్రేమ్గౌడ్ ,యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్ , పి కిరణ్ , స్థానిక టీఆర్ఎస్ నేతలు కాశీగారియాదగిరి, మసున వెంకటేష్ , గంజి వెంకటేష్ , బోల్ల శ్రీను, డి వి కుమార్ , ఎల్లప్ప, మహేష్రాజ్, నాని, తదితరులు పాల్గొన్నారు.