సైదాబాద్ : సైదాబాద్ డివిజన్ పరిధి రెవెన్యూ బోర్డు కాలనీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (సీసీఆర్ఎఎస్-మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్) లో అయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం ఆయుర్వేద ఆహార ఉత్సవం నిర్వహించారు.
ద మిల్లెట్ హోటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిద్ధార్ధ యోగా విద్యాలయానికి చెందిన డాక్టర్ కె.వై. రాంచంద్రరావు మాట్లాడుతూ ఆహార నియమాలతోనే అనేక వ్యాధులను నియంత్రించుకోవచ్చునని, అన్ని రోగాలకు ఆయుర్వేద వైద్యంలో చక్కటి పరిష్కరమార్గాలున్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రకృతిలో మమేకమై జీవించాల్సిన అవశ్యకతను వివరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ ఇంచార్జీ అసిస్టెంట్ డాక్టర్ గోలి పెంచల ప్రసాద్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ఆహారం, పోషకాహారాన్ని ప్రతి ఒక్కరూ నిత్యం తీసుకోవాలని, దీంతో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుందన్నారు.
ఆయుర్వేద ఆహార ఉత్సవంలో అనేక రకాల వంటకాలను, దినుసులను, వంట పాత్రలను ప్రదర్శించి విక్రయించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సంస్ధ అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సాకేత్రాం, డాక్టర్ బిసవ్వ రంజాన్దాస్, డాక్టర్ రమేష్ కుమార్, డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి, అప్పారావు, లైబ్రేరియన్ శ్రీనివాసరావు, మిల్లెట్ హోటల్ నిర్వహకులు అమర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.