రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై అధికారుల నజర్
అడుగడుగునా టాస్క్ఫోర్స్, పోలీసుల తనిఖీలు
పరిమితికి మించి ప్రయాణిస్తున్న ప్రైవేట్, ప్యాసింజర్ వాహనాలపై చర్యలు
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, సీజ్
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 26 (నమస్తేతెలంగాణ);రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలుసు. కానీ, ఎవరూ పట్టించుకోరు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతాయని తెలిసినా కొందరు ప్రైవేటు, ప్యాసింజర్ వాహనదారులు బాధ్యత మరిచి ప్రవరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడు తున్నారు. దీన్ని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. కలెక్టర్ ఆదేశాలతో అడుగడుగునా టాస్క్ఫోర్స్, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలకు జరిమానా విధించడంతో పాటు సీజ్ చేస్తున్నారు.
జిల్లాలో పరిమితికి మించిన ప్రయాణి కులను తరలిస్తూ తరచూ ప్రమాదాలకు కారణ మవు తున్న వ్రైవేటు, ప్యాసింజర్ వాహనాలపై కఠిన చర్యలు చేప ట్టేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. ఆ వాహ నాలను గుర్తించి డ్రైవర్లకు అవగాహన కల్పిస్తు న్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యే కంగా టా స్క్ఫోర్స్ టీం నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
ప్రమాదాలతో వీధిన పడుతున్న కుటుంబాలు..
ప్రైవేటు వాహనాలు పరిమితికి మించి ప్యాసింజర్ లతో ప్రయాణాలు చేయడం, తగిన శిక్షణ, వేగంపై అవ గాహన లేకపోవడం వల్ల అధికంగా రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయి. దీంతో అనేక మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోవడంతోపాటు క్షతగాత్రుల వుతున్న వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి.ఈ క్రమంలో అధికారులు పరిమితికి మించిన ప్యాసిం జర్లను తరలించే వాహనాలు, వాటిని నడిపించే డ్రైవర్ల పై దృష్టి సారిస్తున్నారు. రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
విస్తృతంగా తనిఖీలు..
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్, కమలాపూ ర్ ఎక్స్రోడ్, కాటారం, మహదేవపూర్, చెల్పూర్, గణ పురం ఎక్స్రోడ్తోపాటు స్థానికంగా గుర్తించిన అనేక ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ టీంలు అడుగడుగునా తనిఖీ లు చేస్తున్నారు.
వాహనాలు సీజ్.
రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు వాహనాలకు జరిమానాలు విధించడంతోపాటు సీజ్ చేస్తున్నారు. 3 సీటర్, 7 సీటర్ ఆటోలు, జీపులతో ఇత ర వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిరం తరాయంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అందుబాటులోకి ఆర్టీసీ సేవలు..
మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపో వడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆ శ్రయించ స్తున్నారు. ఆర్టీసీ అధికారులు కేటాయించిన రూట్లలో బస్సులను సమయానుకూలంగా నడిపించడం వల్ల ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటున్నది.
ఎనిమిది వాహనాలను సీజ్ చేశాం
జిల్లాలో ఇప్పటి వరకు 8 వాహనాలను సీజ్ చేశాం. ప్రతి రోజూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. వా హనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించా లి. పరిమితికి మంచి ప్రయాణికులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.