మోటకొండూర్, జనవరి 21 : మండలంలో కొవిడ్ మొదటి డోసు వేసుకున్న ప్రతి ఒక్కరికీ రెండో డోసు వేయాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య, అంగన్వాడీ కేంద్రాలను ళెక్రవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలన్నారు. జ్వర సర్వేను రెండ్రోజుల్లో పూర్తి చేయాలని, వివరాలను క్షుణ్ణంగా నమోదు చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని టెస్ట్కు తీసుకు రావాలని, పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే మందులు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరస్వామి, హెచ్ఈఓ నర్సయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, పీహెచ్ఎన్ దేవావర, హెల్త్ అసిస్టెంట్ యాకయ్య, ఏఎన్ఎం గీత, సిబ్బంది పాల్గొన్నారు.
పీహెచ్సీ, తాసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తాసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ప్రసవాల గది, మందులు నిల్వ ఉంచే రూమ్, ల్యాబ్, రోగుల గది, పారిశుధ్యాన్ని పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో రికార్డులను, భూముల రిజస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆమె వెంట తాసీల్దార్ జయమ్మ, మండల వైద్య సహాయ అధికారి సృజన, సూపర్వైజర్ సాంబులమ్మ, ఆర్ఐ యాదగిరి ఉన్నారు.