మియాపూర్ : వెస్ట్జోన్ శేరిలింగంపల్లి పరిధిలో ఇండియా ఏహెడ్ బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని షేక్ పేట్ ఫ్లె ఓవర్, అన్నపూర్ణ భోజన కేంద్రం, కొత్తగూడ ఫ్లె ఓవర్, ప్రేమ్నగర్ బస్తీ దవాఖానా, హఫీజ్పేట్, సురక్షా కాలనీ రిజర్వాయిర్లను బృందం పరిశీలించింది.
అలాగే రెడ్డి కాలనీలోని మురుగు నీటి శుద్ధి కేంద్రం, శిల్పారామం ఎదురుగా ఉన్న ఏసీ బస్టాప్, అయ్యప్ప సొసైటీ అండర్ పాస్, మైండ్ స్పేస్ జంక్షన్, రూ.5 భోజన కేంద్రంలను సదరు బృందం సభ్యులు పరిశీలించారు.
తక్కువ కాలంలో విశేషమైన పురోగతిని నగరం సాధించిందని కితాబునివ్వటంతో పాటు ప్రతీ అభివృద్ధిని వీడియోలో నిక్షిప్తం చేసుకున్నది. వేగవంతమైన పురోగతిపై స్థానికుల,అధికారుల అభిప్రాయాలను సైతం వీడియో ద్వారా చిత్రీకరించారు.
అనతి కాలంలో అభివృద్ధికి నగరం కేరాఫ్గా మారిందని, ప్రధానంగా ఐటీ ప్రాంతంలో విశేషమైన పురోగతి నెలకొన్నదని సదరు కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడి పురోగతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బృందం పేర్కొంది.
కాగా ఈ బృందానికి శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్, ఆర్ఐ శ్రీనివాస్, సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్తో ,హఫీజ్పేట్ జలమండలి జీఎం రాజశేఖర్తో పాటు ఇతర అధికారులు క్షేత్రసాయి పురోగతిని పరిశీలించటంలో తోడ్పాటును అందించారు.