వనపర్తి రూరల్, జనవరి 20 : గొర్రెలు దొంగతనం చే యడానకి వచ్చారన్న అనుమానంతో 9 మందిని స్థానికు లు పట్టుకొని చితకబాది గ్రామ పంచాయతీలో కట్టేసి పోలీసులకు సమాచారం అందించిన ఘటన వనపర్తి జిల్లా చి మనగుంటపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. చిమనగుంటపల్లి గ్రామ శివారులో యాదవులు గొర్రెల మందను రోడ్డుకు సమీపంలోని పొలం వద్ద నిలిపారు. రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు డీసీఎంలో వచ్చి గొర్రెల మంద సమీపంలోకి చేరుకున్నా రు. కుక్కల అరుపులతో తేరుకున్న గొర్రెల కాపరి యాద య్య ఎవరని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వచ్చిన వారు అతడిపై దాడి చేయగా.. యాదయ్య కుడి చెవి తెగిపోయి స్పృహ కోల్పోయాడు. అక్కడ ఉన్న వారు అతడి జేబులో ఉన్న సెల్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఒక్కసారిగా అందరూ అక్కడికి చేరుకొని వారి ని పట్టుకున్నారు. విచారించగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి గ్రామంగా తెలిపారు. వారం తా అక్కడే ఉన్న మరో కారులో ఎక్కారు. దీంతో మీకు.. వారికి ఏమిటి సంబంధమని గ్రామస్తులు ప్రశ్నించగా.. కా రులోని వారు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు కారు, డీసీఎం అద్దాలను ధ్వంసం చేశారు. వీరిని పట్టుకొని గ్రామ పంచాయతీ కా ర్యాలయానికి తీసుకెళ్లి బంధించారు. పోలీసులకు సమాచారం అందించగా.. గురువారం ఉదయం వారు వచ్చా రు. అయితే పోలీసులను అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్ర యత్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా రెండు వర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని రూరల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.