షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నందికొండ, ఏప్రిల్ 4 : సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఓటమి తథ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ హిల్కాలనీలో 4వ, 5వ వార్డులో ఎన్నికల నందికొండ ఇన్చార్జి, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూదిమెట్ల బాలరాజ్యాదవ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా పైలాన్కాలనీలోని 8వ వార్డులో 200మందితో కరీంనగర్ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ గల్లీ గల్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుతూ చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం స్టేజీ షోలకే పరిమితమయ్యారని అన్నారు. ప్రజలు నోముల భగత్ను గెలిపించడం ఖాయమని, జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదని హితువు పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్, మండలాధ్యక్షుడు సత్యనారాయణ, కృష్ణయ్య, కౌన్సిలర్లు రమేశ్జీ, నాయకులు సైదులు, శాంతకుమారి, జితేందర్, కోదండం, కృష్ణ, లింగస్వామి, శంకర్యాదవ్, అజయ్, మధు, రాజు, పాల్గొన్నారు.