చార్మినార్ : జూ పార్క్ అభివృద్ధిలో సిదానంద్ కుక్రేటి సేవలు అనన్య సామాన్యమైనవని జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు. జూ పార్క్ డైరెక్టర్గా సుదీర్ఘకాలం కొనసాగిన డాక్టర్ సిదానంద్ కుక్రేటి శుక్రవారం పదవి విరమణ చేశారు.
ఈ సందర్భంగా జూ పార్క్లోని బయోస్కోఫ్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిదానంద్ కుక్రేటి జూ పార్క్ అభివృద్దికి ఎంతో సేవ చేశారని తెలిపారు. రాయల్ బెంగాల్ పులుల సంతతి అభివృద్దితోపాటు దేశంలోని జూ పార్క్లోకెల్ల అత్యంత ప్రత్యేకతను చాటుకుంటున్న తెల్లపులల సంరక్షణ కోసం సిదానంద్ కుక్రేటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా అన్ని వ్యవస్థలు ఎదుర్కొన్న సమస్యల్లాగే జూ పార్క్ సైతం పలు సమస్యల ను ధీటుగా ఎదుర్కొంటూ నిలబడేందుకు కృషిచేసిన ప్రయత్నాల్లో సిదానంద్ కృషి ఎంతగానో ఉందన్నారు. భవిష్యత్తులో నూ తగిన సలహాలను అందిస్తూ జూ పార్క్ అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ సర్కిల్ కన్జర్వేటర్ క్షితిజా, వైల్డ్లైఫ్ ఓఎస్డి ఏ. శంకరన్, జూ పార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) ఎం.ఏ హకీం,అసిస్టెంట్ క్యూరేటర్లు సునీత, స్వరూపరాణి, డిప్యూటీ రేంజ్ అధికారి నాగరాజు, మంజుల, అన్నామణి, సందీఫ్, లక్ష్మీనారాయణ, హనీఫుల్లా తదితరులు పాల్గొన్నారు.