దౌల్తాబాద్, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోని పలు గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దౌల్తాబాద్ తోక రాములు, బిచ్చల్ జైపాల్, అంతారం అధ్యక్షుడిగా కటిక కాశీనాథ్, గుండేపల్లి అధ్యక్షుడిగా సాయిరెడ్డి, సుల్తాన్పూర్ అధ్యక్షుడిగా అర్జున్ బాలకిష్టయ్య, బాలంపేట అధ్యక్షుడిగా బాలప్ప, తిమ్మారెడ్డిపల్లి అధ్యక్షుడిగా పటేల్ నరేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్రావు, టీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ బయిరెడ్డి నరోత్తంరెడ్డి, జడ్పీటీసీ కోట్లా మహిపాల్, ఎంపీపీ విజయ్కుమార్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, కొడంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భగవంతు, మాజీ జడ్పీటీసీ వెంకటమ్మపకీరప్ప, మండల కోఆఫ్షన్ సభ్యులు జాకీర్అలీ సర్పంచులు, ఎంపీటీసీ, టీఆర్ఎస్ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.
ఉడిమేశ్వరం గ్రామంలో..
కొడంగల్, సెప్టెంబర్ 11: మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాంరెడ్డి, సెక్రెటరీగా కుర్వ వెంకటయ్యతో పాటు మరికొంతమంది సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముగిసిన టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు
బొంరాస్పేట, సెప్టెంబరు 11 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి తెలిపారు. శుక్రవారం 10 గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాపన్చెరువుతండా నీల్యానాయక్, కమ్లీబాయి, నాందార్పూర్ మాసని వెంకటయ్య, బుగ్గయ్య, చౌదర్పల్లి తుల్జారెడ్డి, పవన్కుమార్రెడి, బాపల్లితండా రమేశ్, రుక్యానాయక్, రోటిబండతండా గోపాల్, శీనునాయక్, లగచెర్ల బసప్ప, శ్రీనివాస్రెడ్డి, దుద్యాల శ్యాసం వెంకటయ్య, సాయిలు, సాగారంతండా నరేష్, గోపాల్ను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
పెద్దేముల్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
పెద్దేముల్, సెప్టెంబర్ 11 : మండల కేంద్రంలో పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు డీవై నర్సింహులు, గ్రామ సర్పంచ్ ద్యావరి విజయమ్మల సమక్షంలో అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దేముల్ అధ్యక్షుడిగా దర్మిదీ వెంకటయ్య, ఉపాధ్యక్షుడిగా బోయిని నర్సింహులు, ప్రధాన కార్యదర్శిగా నయీం, సంయుక్త కార్యదర్శిగా బోడ బందెప్ప, కోశాధికారిగా కె.మాణిక్య ప్రభు, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, గోపాల్, సత్తారి, డబ్బుల నర్సింహులు, ఆనందం, నర్సింహులు, కుమ్మరి విఠల్ను ఎన్నుకున్నారు. అనుబంధ కమిటీలను కూడా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు కిషన్రావు, ఎర్ర బాలప్ప, పార్టీ నాయకులు జితేందర్రెడ్డి, ద్యావరి కృష్ణారెడ్డి, సి.రంగయ్య, ఎర్ర రవీందర్, మైనారిటీ నాయకులు ఎండీ.ఆజం ఖాన్, అజీమ్, సహీద్, అన్వర్, ఆదిల్, ఎల్లప్ప పాల్గొన్నారు.
దోమ మండల పరిధిలో..
దోమ, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోని దిర్సంపల్లి తండాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంతునాయక్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సోమ్లానాయక్ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోగా, గుండాల గ్రామంలో పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోయిని బాల్రాజ్, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల వెంకటయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గోపాల్, లక్ష్మణ్నాయక్, సుభాష్నాయక్, డోకూరి కేశవులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కులకచర్ల మండలంలో..
కులకచర్ల, సెప్టెంబర్ 11 : మండల పరిధిలో వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఎంపికైన సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. మండల పరిధిలోని దాస్యనాయక్తండా, చెరువుముందలితండా(ఎ), చెరువుముందలితండా(కె), టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జోగు వెంకటయ్యగౌడ్, రాజప్ప, మొగులయ్య, సర్పంచ్ పద్మ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవిలాల్, బాంబే రాములునాయక్, దాస్యనాయక్తండా సర్పంచ్ శంకర్నాయక్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
దాస్యనాయక్తండా గ్రామ కమిటీ
అధ్యక్షుడిగా రవి, ఉపాధ్యక్షుడిగా సంతోష్, కార్యదర్శిగా శంకర్ ఎన్నికయ్యారు.
పట్లూర్ తండాలో..
మర్పల్లి, సెప్టెంబర్ 11 : మండలంలోని పట్లూర్ తండాలో గ్రామ కమిటీని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా బానోత్ ప్రభు, యూత్ అధ్యక్షుడిగా బానోత్ వినోద్, గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలిగా రేణుక బాయిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధానకార్యదర్శి మధుకర్, నాయకులు అశోక్, రవి, శ్రీశైలం, సోషల్ మీడియా మండల కన్వీనర్ వికాస్ పాల్గొన్నారు.
బషీరాబాద్..
బషీరాబాద్, సెప్టెంబర్ 11 : మండల కేంద్రమైన బషీరాబాద్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లాపూరం వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, నాయకులు సుధాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అనంతయ్య, శ్రవణ్, వడ్డే హన్మంతు, బన్సీలాల్ ఉన్నారు.
తిర్మలాపూర్లో టీఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక
కులకచర్ల, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీని టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా బల్ల శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యక్షుడిగా రత్నకుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్యాదవ్, సంయుక్తకార్యదర్శిగా తరుణ్గౌడ్, కోశాధికారిగా మురళీగౌడ్, ప్రచార కార్యదర్శిగా శ్రీకాంత్గౌడ్, సభ్యులుగా శ్రీనివాస్గౌడ్, కృష్ణయ్యగౌడ్, ప్రసాద్గౌడ్, రాజుగౌడ్, వెంకటయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తిర్మలాపూర్ గ్రామ అధ్యక్షుడు మహేశ్వరం రాములుగౌడ్, ఉపాధ్యక్షుడు బాపల్లి నాగార్జున్గౌడ్, నాయకులు అంజిలయ్యగౌడ్, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.