మాదాపూర్ : మాదాపూర్లోని హెచ్ఐసీసీలో రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, ఏఐజి హస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జివి రావు, నటి మంచు లక్ష్మీ, రత్నదీప్ రిటైల్ డైరెక్టర్ మనీష్ భార్టియా, సెయింట్ మారిస్ గ్రూప్ డైరెక్టర్ మహేందర్రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ ఫిక్కీ ఫ్లో పాస్ట్ చైర్పర్సన్ కామిని సఫారీలతో పాటు రౌండ్ టేబుల్ ఇండియా నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందులో భాగంగా వివిధ కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి అవార్డులను అందజేయడం జరిగింది. ప్రతి కేటగిరీలో ఇద్దరు విజేతలను ఎంపిక చేసి మొదటి విజేతకు అచీవర్ అవార్డును, రెండవ విజేతకు ఎమర్జింగ్ అవార్డును ప్రధానం చేశారు. స్పోర్ట్స్, స్పెషల్ అవార్డు ఫర్ ఉమెన్, ఎన్జీవో, రిటైల్, ఫిల్మ్ ఆర్టిస్ట్, ఎస్ఎమ్ఇ, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఫుడ్ అండ్ బెవరెజ్, మెడికల్ స్టార్టప్లు, ఆర్ట్ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్, ఇన్నర్ వెల్నెస్ అనే పద్నాలుగు కేటగిరీలకు అవార్డులను ప్రధానం చేశారు.