బాన్సువాడ, మే 13: బాన్సువాడ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 25 వేల నుంచి 50 వేల మంది జనాభా ఉన్న 41 మున్సిపాలిటీల్లో బాన్సువాడ మున్సిపాలిటీ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో మొదటిస్థానంలో నిలిచింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ చేతుల మీదుగా బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ కల్యాణం రమేశ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేశ్ మాట్లాడుతూ.. స్పీకర్ పో చారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో ఈ పురస్కారం సాధించామని అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.