దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 16 : చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తిస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రతాప్రెడ్డి, చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కవిత పర్యవేక్షణలో హుండీ డబ్బులను లెక్కించగా, ఆలయానికి రూ.6,08,135 ఆదాయం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు నాగరాజు, శ్రీనివాస్రెడ్డి, శంకర్, కృష్ణవేణి, ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, వెంకటయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.