అవగాహన కల్పిస్తున్న అధికారులు
టీకా వేయించుకునేందుకు ప్రజల ఆసక్తి
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులు
మక్తల్ టౌన్, ఏప్రిల్ 16 : మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని ప్రోగ్రాం ఆపీసర్ డాక్టర్ సిద్ధప్ప అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతున్నదని, అదేవిధంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని సిద్ధప్ప శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మక్తల్ ప్రభుత్వ దవాఖానలో 1,407 మందికి పరీక్షలు, కర్నెలో 895 మందికి పరీక్షలు చేయగా, 45 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. టీకా 2,437 మందికి ఇచ్చామన్నారు. 45 ఏండ్లపై బడిన వారికి టీకా వేస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ మా స్కులు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కా ర్యక్రమంలో ఎంపీహెచ్ ఈవో లక్ష్మీనారాయణ, ఎల్టీ శ్రీ ధర్, కర్నె, మక్తల్ ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న టీకా
ధన్వాడ, ఏప్రిల్ 16 : మండల ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో కరోనా వైరస్ నివారణ టీకా పంపిణీ కొనసాగుతున్నది. టీకా వేసుకునేందుకు వచ్చే వారికి కరోనా పరీక్ష లు నిర్వహించిన తర్వాత నెగిటివ్ వ చ్చిన వారికి మాత్రమే టీకా వేస్తున్నా రు. 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. శుక్రవారం 50 మందికి టీకా లు వేశారు. కార్యక్రమంలో వైద్యాధికా రి వెంకట్దాస్, హెల్త్ సూపర్వైజర్లు క తలప్ప, ఆశమ్మతోపాటుగా ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి కదిలిన యంత్రాంగం
ఊట్కూర్, ఏప్రిల్ 16 : మండలంతోపాటు పరిసర గ్రామాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఆయా పీహెచ్సీల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అటు ప్రజలు, మ రోవైపు అధికార యంత్రాంగంలో ఆందళన వ్యక్తమవుతున్నది. శుక్రవారం ఊట్కూర్ పీహెచ్సీలో 100 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ కేసు లు నమోదైనట్లు పీహెచ్సీ సిబ్బంది తెలిపారు. పులిమామి డి పీహెచ్సీ పరిధిలో 216 మందికి టెస్టులు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరికీ వైద్యాధికారులు ఐసోలేషన్ కిట్ అందించి హోం క్వా రంటైన్లో ఉండాలని సూచించారు. కాగా మాస్కులు లే కుండా తిరుగుతున్న వారికి పోలీసులు రూ.వెయ్యి జరిమా నా విధిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలని, అత్యవసరం అనిపిస్తేనే రోడ్లపైకి రావాలని సర్పంచులు, అధికారులు దండోరా వేయించి అప్రమత్తం చేస్తున్నారు.
టీకా వేయించుకోవాలి
ప్రతిఒక్కరూ టీకా తప్పకుండా వేయించుకోవాలని ఎక్సైజ్ సీఐ నాగేందర్గౌడ్ అన్నారు. ఊట్కూర్ పీహెచ్సీ లో ఆయన టీకా వేయించుకున్నారు. కరోనా నియంత్రణ కు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. మల్లేపల్లి సర్పంచ్ మాణిక్యమ్మ, టీఆర్ఎస్ నాయకుడు కతలప్ప టీకా వేయించుకున్నారు. ఊట్కూర్, పులిమామిడి పీహెచ్సీ సెంటర్లలో 200 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నరేశ్చంద్ర, డాక్టర్ సురేఖ, ఎంపీహెచ్ఈవో హేమ్లాల్, ఏఎన్ఎం శైల జ, ఆరోగ్యమిత్ర సురేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్: ఆ మసీదులో శుక్రవారం పార్థనలు నిలిపివేత
పెండ్లి పత్రికపై లాలూ ఫోటో, ఆర్జేడి సింబల్