చంపాపేట : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి దీప్తి ఆధ్వర్యంలో మహా లింగార్చన కార్యక్రమం, సహస్ర దీపాలం కరణ, స్వామి వారికి అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారికి దీపారాధనలు సమర్పించు కున్నారు. అనంతరం ఆంజనేయ స్వామికి పల్లకి సేవా కార్యమ్రాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు భార్గవ శర్మ, చంద్రకాంత శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు మురళిధర్ శర్మ, సంతోష్ కుమార్, శ్రవణ్ కుమార్, పీతాంబరాచారి, ప్రవీణ్ కుమార్, మధుసూదన్ శర్మ, ఆలయ కమిటి మాజీ చైర్మెన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ ధర్మకర్తలు బండారు శ్రీనివాస్ రెడ్డి, చలమల యాదిరెడ్డి, రాజేష్ గౌడ్, మొరిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.