మన్సూరాబాద్ : గ్లోబల్ షోటోకాన్ కరాటే డూ ఇండియా (జీఎస్ కేడీఐ) ఫౌండర్, డైరెక్టర్ హన్సీపురం వెంకటేశం ఆధ్వర్యంలో ఈనెల 17, 18, 19 తేదీలలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల బ్రోచర్ను గురువారం నాగోల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు.
మూడవ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ క్రీడల్లో నైపుణ్యం కనబరుస్తున్న యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.