బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 50 పడకల మెటర్నిటీ ఆస్పత్రి కోసం చాలాకాలంగా వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ కవితారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆమె ప్రయత్నాలకు ఫలితం దక్కింది. ఇప్పటికే మంత్రి కేటీఆర్తో పాటు సంబంధితశాఖ అధికారులను కలిశారు.
సోమవారం టీకా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి హరీష్రావును ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు కార్పొరేటర్ కవితారెడ్డి మెటర్నటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరడంతో ఆయన అంగీకరించారు. వెంటనే ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించడంతో పాటు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్రావు ఆదేశించారు.
దాంతో అప్పటికప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి పీహెచ్సీ వెనకాల ఉన్న 300గజాల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. మెటర్నిటీ ఆస్పత్రికి అన్ని విధాలుగా సరిపోయే విధంగా స్థలం ఉందని, వెంటనే అంచనాలు రూపొందించి ఆస్పత్రి నిర్మాణం కోసం చర్యలు ప్రారంభిస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు.
సుమారు 1లక్ష మందికి పైగా జనాభా ఉండే బంజారాహిల్స్ పరిసర ప్ర్రాంతాల్లో మెటర్నటీ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని, ఆస్పత్రిని మంజూరు చేసిన మంత్రి హరీష్రావుకు కృతజతలు తెలుపుతున్నామని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్వో డా.అనురాధ, డా.సీమా రహ్మాన్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, అశ్వక్, జావెద్ తదితరులు పాల్గొన్నారు.