అమీర్పేట్ : దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అమీర్పేట్ డీకేరోడ్డులోని నివాసానికి చేరుకున్న గవర్నర్ రోశయ్య సతీమణి శివలక్ష్మితో పాటు కుమారులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా మహోన్నత విలువలకు కట్టుబడి ఉన్నారంటూ రోశయ్య సేవలను కొనియాడారు.