శంషాబాద్ రూరల్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మల్కారం పీఏసీఎస్ సోసైటి పరిధిలో గోదాం నిర్మాణం కోసం మల్కారం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం సర్వే నంబర్ 43లో రెండు ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరక్టర్ సతీష్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శంషాబాద్ తహసీల్దార్ జనార్ధన్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.
గ్రామాలలో రైతులుసండించిన దాన్యాన్ని గోదాంలో భద్రపరచడం కోసం గతంలో ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. కాని తెలంగాణ ప్రభుత్వంలో నూతన గోదాములను నిర్మాణం చేస్తు రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు, యాదగిరిరెడ్డి, డైరక్టర్లు సత్తయ్య, బాల్రాజ్, శివాజీ, యాదగిరి, కృష్ణరెడ్డి, వెంకటేశ్, సురేష్ తదితరులు ఉన్నారు.