అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో పుట్పాత్ల ఆధునీకీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్, తిలక్నగర్ పెద్ద గణేష్లేన్లో రూ.6 లక్షల వ్యయంతో నూత నంగా నిర్మించనున్న పుట్పాత్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం వారు ఇందిరానగర్, తిలక్నగర్ కాలనీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల పరిధిలో ఉన్న అన్ని పుట్ పాత్లను అందంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పటికే కాచిగూడ స్టేషన్ రోడ్డులో పుట్పాత్ ఆదునీకీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
శ్రీరమణ చౌరస్తా నుంచి అంబర్పేట తహశీల్దార్ కార్యాలయం వరకు ఉన్న పుట్పాత్ను చక్కటి పూలచెట్లతో అలంకరించడం జరిగిందని చెప్పారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయా బస్తీలలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్డు ప్యాచ్వర్క్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. పెద్ద పనులైతే తగిన ప్రతిపాదనలు తయారు చేయించి నిధులు మంజూరు చేయిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ శ్వేత, వర్క ఇన్స్పెక్టర్ నరేందర్, టీఆర్ఎస్ పార్టీ నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, నాయకులు భాస్కర్గౌడ్, నరేందర్, శ్రీనివాస్రెడ్డి, సతీష్, సతీష్చంద్రగౌడ్, శంకర్, నాయక్, శరత్, లీలావతి, రేణుక, బీజేపీ నాయకులు శ్యామ్రాజ్, మధుయాదవ్, లక్ష్మణ్, కేజే బాలు, గోపాల్, మల్లిఖార్జున్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.