మైలార్దేవ్పల్లి : దారి దోపిడికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహ, డీఐ రాజేందర్గౌడ్ , డీఎస్ ఐ కుమార్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
ఉప్పర్ పల్లికి చెందిన అజయ్ కుమార్ మంగళవారం రాత్రి మార్బుల్ లోడింగ్ పనులు ముగించుకొని తన స్నేహితులతో కలిసి దుర్గానగర్ చౌరస్తాలో ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఆరాంఘర్ సమీపంలోకి రాగానే మహమ్మద్ ఆరీఫ్ ఇఖ్బాల్ (37) సమీర్ పాషా (24) మహమ్మద్ ఆలీ (24) ముగ్గురు వారు వెళ్తున్న ఆటోను ఆపారు.
ఆటోను ఓల్డ్ కర్నూల్ రోడ్డులోకి తీసుకేళ్లి అందులో కూర్చున్న వారిని చితకబాది వారి వద్ద నున్న అయిదు వందల రూపాయలు , ముగ్గురి వద్ద నున్న సెల్ ఫోన్లు తీసుకున్నారు. అజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురు నిందితుల నుండి నగదు ,సెల్ఫోన్లు స్వాదీనం చేసుకోని రిమాండ్కు తరలించారు. ఇందులో మహమ్మద్ ఆరీఫ్ ఇక్బాల్ పై అంబర్పెట్ , రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.