హైదరాబాద్: ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండలో ఉన్న శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శివుడికి ప్రత్యేక రుద్రాభిషేకం (అన్నపూజ) నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్లను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది.
ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుడి ఆవరణలో వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొడారి నర్సింగరావు, ప్రధాన అర్చకుడు రాజశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.