బాధితులకు ప్రజాప్రతినిధులు సహకరించాలి
పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగవద్దు
ఏసీపీ ఉమేందర్
కమాన్పూర్, మే 30: పల్లెల్లో కరోనా కట్టడికే గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని ఏసీపీ ఉమేందర్ తెలిపారు. జూలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్ బొల్లపెల్లి శంకర్గౌడ్ అధ్యక్షతన కరోనా కట్టడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగ్గించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామా ల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ పోలీసు అధికారి, ఆశ కార్యకర్తలతో కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇటీవలే రొంపికుంటలో ప్రథమంగా కమిటీని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జూలపల్లిలో వేశామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో కరో నా నిర్ధారణ పరీక్షలు చేయించగా, పాజిటివ్ వచ్చి న వారు 18 మంది ఉన్నారని వివరించారు. ఇక పై ఈ సంఖ్యను పూర్తిగా తగ్గించి కరోనా దరిదాపులకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరుగవద్దని తెలిపారు. ఎవరైనా అలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హ్చెరించారు. పాజిటివ్ వచ్చిన వారు క్వారంటైన్ కాల వ్యవధి పాటు ఐసొలేషన్లోనే ఉండాలని సూచించారు. నిత్యావసరాలు, తాగునీరు, కూరగాయలు అవసరమైతే ఈ కమిటీలోని వారికి సమాచారం అందిస్తే వారు సమకూరుస్తారని తెలిపారు. గ్రామంలోని ఆశ కార్యకర్తలకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్లను అందజేశారు. ఆశ కార్యకర్తల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అలాగే గ్రామంలోని ప లువురి కరోనా బాధితుల ఇండ్లలోకి వెళ్లి వారికి మనో ధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో గో దావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాస రావు, కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్, ట్రైనీ ఎస్ఐ నవీన్కుమార్, ఎంపీటీసీ శెవ్వ శంకరయ్య, ఉప సర్పంచ్ పోలుదాసరి సాయి కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.