డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దనూతన రోడ్డును పూర్తి చేయండి
నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
క్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణ
సిరిసిల్ల రూరల్, జూన్ 24: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం (కేసీఆర్ నగర్) కోసం ఏర్పాటు చేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఆర్అండ్బీ, రెవెన్యూ, మున్సిపల్, సర్వే అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచనలకు అనుగుణంగా పనులు జరుగాలని, రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ఫ్లాంటేషన్ను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సర్వేయర్లు, అధికారులు, తదితరులు ఉన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
సిరిసిల్ల టౌన్, జూన్ 24: పలు అభివృద్ధి పను ల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ జిల్లాలో త్వర లో పర్యటించనున్న క్రమంలో స్థానిక నేతలు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. రగుడు శివారులోని సమీకృత కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఇక్క డ టీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ రాపెల్లి దినేశ్, అడ్డగట్ల మురళి ఉన్నారు.