ప్రత్యామ్నాయంగా రైతుల సాగు..
ప్రైవేట్ కంపెనీల ప్రోత్సాహం
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి
రెండు జిల్లాల్లో 500 ఎకరాల్లో పంట
పురుగులు, తెగుళ్ల దాడి తక్కువే
వరంగల్ సబర్బన్, మే 2 : దినదినం ఎదురవుతున్న పెట్టుబడి కష్టాలను దాటుకునేందుకు రైతులు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే పంటలవైపు అడుగులు వేస్తున్నా రు. ఇందులో భాగంగానే రెండు మూడేళ్లుగా పొగాకు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ప్రైవేట్ కంపెనీలు బై బ్యాక్ ఒప్పందంతో ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు 4,500 ఎకరాల్లో రైతులు పొగాకు పండిస్తున్నారు.
నాలుగు నెలల్లో చేతికి
పత్తి పంట మాదిరిగా సుదీర్ఘంగా కాకుండా కేవలం నాలుగు నెలల్లోనే పొగాకు చేతికందుతుంది. ఇసుక నేల లు, ఎర్ర నేలలు, సందుకట్టు భూములు పొగాకు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఒకటిన్నర నెలల నారును ప్రధా న పొలంలో నాటుకోవాలి. మూడు నెలల తర్వాత మొదటి పది ఆకులు కోతకు వస్తాయి. మొత్తం మూడు కోతలు ఉంటాయి. పొగాకు సాగుకు పెట్టుబడి చాలా తక్కువవుతుంది. చీడపీడల బాధకూడా తక్కువే ఉంటుంది. ఆలస్యంగా నాటుకుంటే డిసెంబర్ నెలలో పేను బంక మాత్రం వస్తుంది. దీనికి కాన్ఫిడార్ మందును ఒకసారి పిచికారీ చేస్తే సరి పోతుంది. మధ్యలో ఒకసారి ఏదైనా రసం పీల్చే పురు గు కనబడితే ప్రొైక్లెన్ అనే మందును వాడుతారు. అంతకు మించి పత్తిపంటలో మాదిరిగా విచ్చలవిడి మందుల వాడ కం ఉండదు. ఇక ఎకరాకు రెండు డీఏపీ, రెండు 20:20 బస్తాలు వేస్తే సరిపోతుంది. యూరియాను వేయాల్సిన అవసరం లేదు. ఆకులు కోసిన తర్వాత 20 నుంచి 25 రోజులు నీడలో ఆర బెట్టి అమ్మకానికి తీసుకెళ్లాలి. పదిహేను రోజులకోసారి నీళ్లు పెడితే సరిపోతుంది.
ప్రైవేట్ కంపెనీల ప్రోత్సాహం
పొగాకు సాగును వీఎస్టీ, దక్కన్ ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. ఉచితంగా విత్తనాలు ఇచ్చి పంటను సైతం ఆయా కంపెనీలే కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఏడాది రైతులు పడించిన పంటను క్వింటాలుకు రూ.9,700 చొప్పున కొనుగోలు చేశాయి. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడిపై కంపెనీలు హామీ ఇస్తున్నా అంతకంటే ఎక్కువ దిగుబడి వస్తోందని చెబుతున్నారు. పెట్టుబడి పోను రైతుకు రూ.60 వేలు గిట్టుబాటవుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పొగాకులో కస్తూరి, సింహ, నాటు పొగాకును ఏపీలోని కర్నూలు జిల్లాలో, కేఎఫ్సీ అనే వెరైటీని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో, వోటి అనే రకాన్ని మహబూబ్నగర్, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సాగు చేస్తుండగా మన ప్రాంతంలో వైట్బర్లీ రకాన్ని పండిస్తున్నారు. పొగాకును కొనుగోలు చేసేందుకు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో, జనగామ జిల్లాలోని రఘునాథపల్లిలో కంపెనీలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశా యి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు పొగాకును తీసుకెళ్లిన తర్వాత హైదరాబాద్కు తరలించి సిగరెట్ల తయారీకి వినియోగిస్తారు.
మొదటి సారి వేసిన
మా బంధువులు చెబితే నేను మొదటిసారిగా ఎకరంలో పొగాకు వేసిన. ఇప్పటి వరకు ఆరు క్వింటా ళ్లు అమ్ముకొచ్చిన. పత్తి కంటే నయమే అనిపిస్తున్నది. వచ్చే ఏడు కూడా వేద్దామను కుంటున్న.
-వలిగె సాంబశివరావు, రైతు, దేవునూరు