20వ డివిజన్లోగుండేటి నరేంద్రకుమార్ను గెలిపించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
డివిజన్లో విస్తృత ప్రచారం
కాశీబుగ్గ, ఏప్రిల్ 27 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గుండేటి నరేంద్రకుమార్ గెలుపు కోసం తిలక్రోడ్డు జంక్షన్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గతంలో గుండేటి రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రజలకు సుపరిచితుడైన గుండేటి నరేంద్రకుమార్కు మళ్లీ అవకాశం కల్పిస్తే ఆదర్శ డివిజన్గా అభివృద్ధి చేస్తారన్నారు. నీతి, నిజాయితీ గల నాయకుడు 20వ డివిజన్ ప్రజలకు దొరకడం అదృష్టమన్నారు. బీజేపీ అబద్ధ్దాలు ఆడుతోందని, కాంగ్రెస్ దొంగల పార్టీ అని అన్నారు. దేశంలో ఉద్యోగాలను ఊడగొడుతున్న బీజేపీ రాష్ట్రంలో ఉద్యోగాలు అడగడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో లక్షా 30వేల ఉద్యోగాలను సీఎం కేసీఆర్ భర్తీ చేశారన్నారు. పక్క రాష్ర్టాల కన్నా మన రాష్ట్రంలోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. సీఎం కేసీఆర్ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించారన్నారు. హైదరాబాద్ తరహాలో గ్రేటర్ వరంగల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్, నాయకులు బాల మోహన్, కుసుమ సారంగపాణి, బేతి రమేశ్, పెండ్యాల సోను, బొచ్చు మహేశ్, పెండ్యాల కొమురయ్య, మంద రమేశ్, జాన్సన్, జక్కి అశోక్, తోట బాలరాజు, వంగరి రవి, సోను, చిమ్మని గోపి, సంతోష్, కోట కనకరాజు, పెరుమాళ్ల విద్యాసాగర్, పరికరాల వంశీకృష్ణ, ఉమగాని గణేశ్గౌడ్, ఈటల దేవేందర్, కళావతి, సుంకరి భాగ్యలక్ష్మి, కవిత, ఎల్లమ్మ, మహ్మద్ పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం సంపూర్ణ మద్దతు
20వ డివిజన్లోని పద్మనగర్లో గల పద్మశాలి సంఘం సభ్యులు టీఆర్ఎస్ అభ్యర్థి గుండేటి నరేంద్రకుమార్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించి, తమ మద్దతును వారు ప్రకటించారు.