‘అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్’
Karma | మనం చేసిన పాప, పుణ్య కర్మలు ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం. చేసే పని, దానికి కలిగే ఫలితం కూడా కర్మను అనుసరించి వస్తుంది. ఈ కర్మలు మూడు విధాలు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. ఇంతకు ముందు జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు. దాని కారణంగా ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారబ్ధం. ఈ జన్మలో చేసిన కర్మ ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. దానిని ఆగామిగా చెబుతారు.
మామిడిపండ్ల కాపు నుంచి పండినవాటిని తీసి ఇచ్చినట్లుగా, భగవంతుడు ప్రతి జీవికి, వారి కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు. ఏ కర్మఫలం ఎప్పుడు, ఏ విధంగా అనుభవించాలో నిర్ణయిస్తాడు. జన్మాంతరాల్లో చేసిన పాప, పుణ్య కర్మలే దుఃఖాలుగా, సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి. ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మ ఫలం నశించి సద్గతులు కలుగుతాయి. మనం చేసే పనులన్నీ భగవత్ సంకల్పంగా భావించినప్పుడు మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతాం. మాధవుడిని ధ్యానిస్తూ, మానవ సేవ చేయడమే మానవ జన్మకు సార్థకత.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?