TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న పున్నమి గరుడ సేవ జరుగనున్నది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.