తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై మూడు కంపార్ట్మెంట్ల(compartments, )లో వేచియున్నారు. టోకెన్లు(token system) లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 65,613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24,306 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.14వచ్చిందని తెలిపారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్(controll room) ఏర్పాటు
తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 5న శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. కల్యాణానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వైఎస్ఆర్ జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు సమర్థవంతంగా పని చేయాలన్నారు.