తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసుదన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ కన్నా తదితరులు పాల్గొన్నారు.