TTD News | తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్యస్వామి హోమం ఘనంగా జరిగింది. యాగశాలలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టారు.
కాగా, అక్టోబరు 29, 30వ తేదీల్లో కూడా సుబ్రమణ్యస్వామి హోమం జరుగనున్నది. ఇందులో భాగంగా అక్టోబరు 30న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు భూపతి, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.