తిరుమల : సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 7వ తేదీ విడుదల చేయనుననారు. ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. ఈ విషయాన్ని బుధవారం ఒక ప్రకటనలో టీటీడీ వెల్లడించింది.
జులై 12, 15, 17తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఆన్లైన్లో విడుదల చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.