మిత్రాణి ధనధాన్యాని ప్రజానాం సమ్మతానివ
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥
స్నేహితులు, ధనధాన్యాదులు గౌరవించదగినవే కావచ్చు. కానీ, నాకు జన్మనిచ్చిన తల్లి, నేను జన్మించిన నా జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి. బంగారుమయమైన ఈ లంక కూడా ఏ మాత్రం నాకు రుచించడం లేదు. ఎందుకంటే లంకే కాదు, స్వర్గం కన్నా కన్నతల్లి, నేను పుట్టిన నా జన్మభూమి ఉన్నతమైనవి. (రామాయణంలో రామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడితో అన్న మాటలివి)