తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవగా.. ఆలయ వేద పండితులు ఉత్సవమూర్తులకు ఊరేగించారు.
ఉదయం ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెం ప్రయోగించారు. ఆస్థానం అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, వీజోఓ మనోహర్, ఏఈఓ గురుమూర్తి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.