తిరుమల : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 24 న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
ఖాళీ గోనె సంచులు, టిన్నుల టెండర్ కమ్ వేలం
టీటీడీ లో పోగయిన వినియోగించిన గోనె సంచులు , టిన్నులను డిసెంబరు 1, 2 తేదీల్లో టెండర్ కమ్ వేలం వేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో ఉన్న మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో టెండర్ కమ్ వేలం జరుగనుందని, ఆసక్తి గలవారు రూ.590లు చెల్లించి టెండరు షెడ్యూల్ పొందవచ్చని సూచించారు.