శ్రీబాలాజీ జిల్లా : తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురుపౌర్ణమి కావడంతో విశేషంగా భక్తులు విచ్చేశారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెప్తున్నాడు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్బాబు, వీజీఓ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి, పార్ పత్తేదార్ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.