శివరాత్రి నాడు చాలామంది ఒక్కపొద్దు ఉంటారు. కొందరైతే పచ్చి గంగ ముట్టరు. పొద్దంతా నిలారం ఉండటం వల్ల… సాయంత్రానికి నిస్సత్తువ ఆవహస్తుంది. ఉపవాస దీక్ష విరమణ తర్వాత కూడా ఆ నీరసం అలాగే కొనసాగుతుంది. అలా కావొద్దంటే.. తక్షణ శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. ఉపవాస దీక్ష నాడు సాబుదానతో చేసిన పదార్థాలకు పాక దోషం ఉండదని పెద్దల మాట. అందుకే, సగ్గుబియ్యంతో చేసే
కిచిడి, పాయసం ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇస్తున్నాం. సాయంత్రానికి ఈ రెండు రెసిపీలు చేసుకొని.. ఉపవాసాన్ని కులాసాగా విరమించండి.
కావాల్సిన పదార్థాలు : సాబుదానా : ఒకటిన్నర కప్పు, పల్లీలు : అరకప్పు, పచ్చి బఠాణీలు : అరకప్పు,
పచ్చిమిర్చి : రెండు, నూనె : మూడు
టీస్పూన్లు, జీలకర్ర : అరటీస్పూన్, ఆవాలు : పావుటీస్పూన్, పసుపు : పావుటీస్పూన్, ఉప్పు : తగినంత,
నిమ్మరసం : ఒక టీస్పూన్, కొత్తిమీర
తురుము : కొద్దిగా, ఆలుగడ్డ : ఒకటి, నూనె : తగినంత
తయారీ విధానం: సాబుదానాని శుభ్రం చేసుకుని రాత్రే నీళ్లుపోసి నానబెట్టుకోవాలి. పల్లీలు వేయించుకుని మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆలూ ముక్కలని నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిబఠాణీలు వేసి మెత్తగా అయ్యేంతవరకూ మగ్గించుకోవాలి.
పచ్చిబఠాణీ బాగా మగ్గిన తర్వాత నానబెట్టిన సాబుదానా, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపి చిన్నమంటమీద పదినిమిషాల పాటు ఉడికించాలి. సాబుదానాను ఎక్కువగా ఉడకనివ్వకూడదు. పొడిపొడిగా ఉండగానే దింపి వేయించిన పల్లీల పొడి, ఆలూ ముక్కలు వేసుకుని కలపాలి. చివరిగా నిమ్మరసం పిండుకోవాలి.