తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టీబీసీ గెస్ట్హౌస్ (TBC Guest House ) వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,987 మంది భక్తులు దర్శించుకోగా 20,902 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారికి రూ. 2.66 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.