తిరుమల : ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు తిరుమల (Tirumala) వేంకటేశ్వర సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,569 మంది భక్తులు దర్శించుకోగా 27,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.93 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
గుంటూరుకు చెందిన అభయహస్త ఫైనాన్స్ సర్వీసెస్ సీఎఫ్ఓ సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.