చెన్నై : వంద మంది మహిళలను వేధించిన ప్రబుద్ధుడిని చెన్నై పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహిళలు, యువతులను వేధించడమే పనిగా పెట్టుకున్న నార్త్ జగన్నాధన్నగర్కు చెందిన నిందితుడు దినేష్ కుమార్ ఆర్మీ అధికారి కూతురును వేధించడంతో ఆయన నిందితుడి బైక్ నెంబర్ను రాసుకుని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఓ కేటరింగ్ కాలేజ్లో చదివిన దినేష్ కుమార్ చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఓ హోటల్లో పనిచేస్తున్నాడు.
రాత్రి పొద్దుపోయిన తర్వాత, ఉదయాన్నే పలు కార్యాలయాల్లో పనిచేసే మహిళలను వేధించడం టార్గెట్గా పెట్టుకున్నాడు. గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ అధికారితో మార్నింగ్ వాక్కు వచ్చి వారి వెనుక నడుస్తుండటం గమనించిన నిందితుడు కుమార్ ఆమెను అభ్యంతరకరంగా తాకి బైక్పై పరారయ్యాడు. కుమార్ను పట్టుకునేందుకు మహిళ తండ్రి విఫలయత్నం చేశాడు. నిందితుడి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేసుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు టూ వీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ను ట్రాక్ చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. తాను ఇప్పటివరకూ 100 మంది మహిళలను వేధించానని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.