దోమలగూడ :పరీక్ష రాసేందుకు నగరానికి వచ్చిన యువతి అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దోమలగూడ సెక్టర్ ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…….జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన జి.హారిక (22) ఈ నెల 25న ఎంబీఏ పరీక్షలు రాసింది. అనంతరం ఊరెళ్లాల్సి ఉండగా స్వగ్రామానికి వెళ్లలేదు, అదే విధంగా ఆమె ఫోన్ పని చేయడంలేదు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు యుసఫ్గుడాలో నివసించే వారి దగ్గరి బంధువు చంద్ర ప్రకాష్కు సమాచారం ఇచ్చారు. అతడు దోమలగూడలో ఆమె నివసించిన హాస్టల్లో అదే విధంగా యువతి స్నేహితుల వద్ద వాకబు చేసిన ఆమె ఆచూకీ లభించలేదు. సోమవారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించిన యువతి బంధువు చంద్రప్రకాష్ హారిక అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.