హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఇన్ని రోజులు కష్టపడి చదివాడు.. ఇవాళ జరిగిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యాడు.. ఇవాళ తమ్ముడి పెళ్లి సైతం ఉండడంతో పరీక్ష రాసి.. ఉత్సాహంతో తమ్ముడి పెళ్లికి వెళ్తూ అనంతలోకాలకు చేరాడు ఓ యువకుడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటు చేసుకున్నది.
ఆంజనేయులు అనే యువకుడు ఎస్ఐ పరీక్ష రాసి ద్విచక్ర వాహనం వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఆంజనేయులు తమ్ముడి పెళ్లి ఇవాళ ఉండడంతో పరీక్ష రాసిన అనంతరం.. ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన పెళ్లి ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.