న్యూఢిల్లీ : ఓ కేసులో అరెస్టయిన భర్తను విడిపించేందుకు సాయం చేయాలని ఆశ్రయించిన మహిళపై అడ్వకేట్తో పాటు నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన నోయిడాలోని సెక్టార్ టూలో వెలుగుచూసింది. అక్టోబర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడగా హర్యానాలోని వల్లభ్ఘఢ్లో కేసు నమోదైంది.
ఈ కేసును ఆదివారం నోయిడా సెక్టార్ 20 పోలీస్ స్టేషన్కు బదలాయించారు. తన భర్తకు బెయిల్ ఇప్పించే విషయం మాట్లాడాలని అడ్వకేట్ తన కార్యాలయానికి రప్పించాడని ఆపై అతడితో పాటు మరో ముగ్గురు సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది.
నేరాన్ని వీడియో తీసిన నిందితులు ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. మహిళ భర్త నోయిడా పోలీసులు దాఖలు చేసిన ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.