తిరువనంతపురం: పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 35 ఏండ్ల షీబా, 28 ఏండ్ల అరుణ్ కుమార్కు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనను పెండ్లి చేసుకోమని అరుణ్కు షీబా ప్రపోజ్ చేసింది. అయితే షీబాకు ఇది వరకే పెండ్లి అయ్యిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అరుణ్కు తెలిసింది. దీంతో ఆమెతో పరిచయానికి ముగింపు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే షీబా అతడ్ని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది.
కాగా, ఈ నెల 16న అరుణ్ కుమార్ తన బావ, స్నేహితుడితో కలిసి ఆదిమాలి సమీపంలోని చర్చికు వెళ్లాడు. షీబా డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు ఆమెను అక్కడ కలిశాడు. అయితే పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన అరుణ్ ముఖంపై షీబా యాసిడ్ పోసింది. దీంతో అతడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
అరుణ్ తొలుత ఆదిమాలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి అతడ్ని తరలించారు. యాసిడ్ దాడి వల్ల అరుణ్ కంటిచూపు పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు తెలిపారు.
కాగా, అరుణ్పై యాసిడ్ పోసిన షీబా ముఖం, శరీరంపైనా యాసిడ్ పడటంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇదంతా చర్చిలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి షీబాను శనివారం అరెస్ట్ చేశారు.