బండ్లగూడ : భర్త తన కొడుకుని చూపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మనస్తాపానికి గురైన మహిళ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. అత్తాపూర్ జలాల్ బాబా నగర్కు చెందిన శహజాన్బేగం(25)ను ఇబ్రహింతో 2017లో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరూ కుమారులున్నారు. కుంటుంబ కలహాలతో మూడు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. విడాకుల కేసు ప్రకారం చిన్న కుమారుడు శాహజాన్బేగం వద్ద ఉండగా, పెద్ద కుమారుడు తండ్రి ఇబ్రహిం వద్ద ఉంటున్నాడు.
తల్లి తనకు పెద్ద కుమారుడిని చూడాలన్నప్పుడు ఇబ్రహిం చూపించాలని తెలిపారు. ఇటీవల తన పెద్ద కుమారుడిని చూసేందుకు శాహజాన్బేగం వెళ్లాగా ఇబ్రహిం చూపించకుడా పలుమార్లు ఇబ్బందులకు గురి చేయడంతో ఆమె మనస్తాపానికి గురైంది. దీంతో ఇంటో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. తండ్రి అబ్దుల్ అజిం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.