తిరువనంతపురం : ఓ మహిళను పిల్లి కరిచింది. భయంతో ఆస్పత్రికి వెళ్లింది. టీకా వేయించుకుందామనే లోపే బాధితురాలిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో ఆ మహిళ తీవ్ర షాక్కు గురైంది. ఈ ఘటన కేరళలోని విజింజమ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
విజింజమ్ ఏరియాకు చెందిన అపర్ణ.. ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో ఆమెను పిల్లి కరించింది. దీంతో టీకా వేయించుకునేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లింది. లోపలికి వెళ్తున్న క్రమంలో అనుకోకుండా అక్కడే ఉన్న కుక్క తోకను ఆమె తొక్కింది. దీంతో కుక్క అపర్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కాలికి తీవ్ర గాయమైంది. అప్రమత్తమైన డాక్టర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం జనరల్ ఆస్పత్రికి తరలించారు.
అపర్ణను కరిచిన కుక్క గత కొన్నేండ్ల నుంచి ఆస్పత్రి ఆవరణలోనే ఉంటుందని స్థానికులు వెల్లడించారు. ఆస్పత్రికి వచ్చిన వారిపై కుక్క దాడి చేస్తుందని వారు పేర్కొన్నారు. రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని, కుక్కను తరలించాలని కోరారు.