భోపాల్: చదువుకునేందుకు కొడుకు స్కూల్కు వెళ్లగా కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్కు చెందిన 21 ఏండ్ల యువతికి మధ్యప్రదేశ్లోని మయానా పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 22 ఏండ్ల యువకుడితో పెండ్లి జరిగింది. యువతి భర్త గుణ టౌన్లోని స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. దీంతో అతడు ప్రతి రోజు గ్రామం నుంచి పట్టణంలోని స్కూల్కు వెళ్లసాగాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న కోడలిపై మామ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని ఆమెను బెదిరించాడు.
కాగా, స్కూల్ అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు ఆమె ఈ విషయం చెప్పింది. దీంతో గురువారం వారిద్దరూ మయానా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. భర్త చదువు కోసం స్కూల్కు వెళ్లగా మామ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ యువతి ఆరోపించింది. తన మామ వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని, వాటిని చూపించి బెదిరించాడని తెలిపింది. కుటుంబంలోని ఇతర మహిళలపైనా లైంగిక దాడి చేశాడని, ఆయన బెదిరింపుల వల్ల వారు నోరు విప్పడం లేదని ఫిర్యాదు చేసింది.
మరోవైపు తన తండ్రి వద్ద చాలా అక్రమ ఆయుధాలు ఉన్నాయని, భార్యకు మద్దతుగా ఉంటే తనను కూడా చంపుతానని తండ్రి బెదిరించినట్లు బాధితురాలి భర్త కూడా పోలీసులకు చెప్పాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు మామపై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.
అయితే, కుటుంబంలో ఆస్తుల గొడవ కారణంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆ యువతి మామ ఆరోపించాడు. తన కోడలి తండ్రికి రాజస్థాన్లోని రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని చెప్పాడు. దీంతో ఆయనపై నమోదైన అత్యాచారం ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.