భువనేశ్వర్ : వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషాలోని పూరి జిల్లా నిమపరలో వెలుగుచూసింది. నిందితులను బలరాం భాయ్ అలియాస్ బలియా ఆయన అనుచరులు కన్హే భాయ్, విద్యాధర్ స్వామియన్, అజిత్ దాస్లుగా గుర్తించిన పోలీసులు ఆదివారం వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి గ్రామానికి చెందిన మహిళ (22) కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాలువ వద్దకు రాగా పొరుగు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు.
మహిళ ఎంతకూ తిరిగిరాకపోవడంతో భర్తతో పాటు కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు. ఆపై కాలువ వద్ద మహిళ ఏడుస్తూ కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.