డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యతీర్థం హరిద్వార్లోని నసీర్పూర్ గ్రామంలో ఒక పూజారి శవమై కనిపించాడు. గత నెలన్నర రోజులుగా ఆలయంలో నివసిస్తున్న పూజారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూజారి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్పీ పరీమింద్ర సింగ్ దోభల్ తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూజారి హత్య గురించి స్థానికులు చర్చించుకుంటున్నారు.