చాంద్రాయణగుట్ట : ద్విచక్ర వాహనాల దొంగిలిస్తున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..గౌస్ నగర్కు చెందిన మహ్మద్ నసీర్ (25) పాత నేరస్తుడు. ఇటివలే ఓ హోండా యాక్టివా వాహనం చోరీకి గురి కావడంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా పాతనేరస్తుడు మహ్మద్ నసీర్ హోండా యాక్టివా బండిని దొంగిలించినట్లుగా నిర్థారణకు వచ్చారు. నిందితున్ని అరెస్ట్ చేసి విచారించగా మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు.
షాద్నగర్, కల్వకుర్తి, అమన్గల్లు, అమ్రబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై గతంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయి.దీంతో ఐదు వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిన్ని రిమాండ్కు తరలించారు.కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.